Breaking News

విధ్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైల్డ్ వికాస్ పౌండేషన్ వారి ఆద్వర్యంలో యల్.బి.యస్ నగర్ నందుగల పుచ్చలపల్లి సుందరయ్య నగర పాలక ఉన్నత పాఠశాల విధ్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య రక్షణ కొరకు చైల్డ్ వికాస్ పౌండేషన్ ను స్థాపించి దాతల ద్వారా దీర్గకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు సహకారాన్ని అందిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు 140 మంది విధ్యార్దులకు కంటి పరీక్షలను నిర్వహించామని ఆయన అన్నారు. వీరిలో దృష్టిలోపం ఉన్న 48 మందికి సంస్దతరపున ఉచితంగా కళ్ళజోళ్ళను అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టోమెట్రిస్ట్ ఫిరోజ్ బాషా, ప్రధాన ఉపాద్యాయులు హుస్సేన్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *