Breaking News

రోడ్డుపైన ఉన్న వర్షపు నీటి నిలువలను వెంటనే తొలగించండి

-అదనపు వాహనాలు పెంచి నిల్వ ఉన్న నీళ్లను త్వరితగతిన తీసేయండి
-అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలో చేరుకున్న వర్షపు నీటి నిల్వలను సత్వరమే తీసేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యాన చంద్ర అన్నారు. ఆదివారం ఉదయం తన పర్యటనలో నోవోటెల్, సి.వి.ఆర్ ఫ్లై ఓవర్, మదర్ తెరిసా జంక్షన్ మొగల్రాజపురం, ఫకీర్ గూడెం, తదితర ప్రాంతాలలో ఉన్న వర్షపు నీటిని పరిశీలించి ఎయిర్ టేక్ మిషన్స్ తో త్వరతిగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ వాహనాలే కాకుండా అదనపు వాహనాలను కూడా సేకరించి త్వరితగతిన రోడ్డు మీద నిల్వ ఉన్న వర్షపు నీటి నిలువలను పూర్తిగా తొలగించవలసిందిగా ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *