ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పంకజ్ రెడ్డి, సరిత దంపతులు పది లక్షల రూపాయలు విలువైన బంగారు హారం అమ్మవారికి బహుకరించారు. వస్తు విలువను నిర్ధారించే… ధ్రువీకరణ పత్రం, హారం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామారావుకు అందజేశారు. అనంతరం దాతలకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
ఆలయ పిఆర్ఓ డి వి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News