Breaking News

ఆర్టీసీ కి చెందిన ఇద్దరు ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కేసులకు ఆమోదం తెలిపిన కమిటీ: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ కి చెందిన ఇద్దరు ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కేసులను కమిటీ ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ కి సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్యోగి, మరొకరు పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్న కేసుకు సంబంధించిన ఉద్యోగులను పరిశీలించి మెడికల్ ఇన్వాలిడేశన్ ప్రతిపాదనలను మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంఛార్జి అధికారి జగదీష్, కలెక్టరేట్ ఎ. ఓ భారతి, సెక్షన్ డిటీ ఉషారాణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *