Breaking News

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షిస్తూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయుట కొరకు ఒక కమిటీని టీటీడీ సిఈ, ఇరిగేషన్ ఈఈ, పిడి ఎన్హెచ్, ఆర్డీఓ తిరుపతి, తుడా సెక్రెటరీ లతో ఏర్పాటు చేసి రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తుడా సెక్రెటరీ డా. వెంకట నారాయణ, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *