Breaking News

Daily Archives: September 9, 2024

వరద ప్రభావిత 66 సచివాలయంలో పూర్తయిన 100% పారిశుధ్య నిర్వహణ

-అతి త్వరలో వరద ప్రభావితమైన మిగిలిన సచివాలయాల్లో కూడా 100% పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేస్తాం*- -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావితమైన 149 సచివాలయాల్లో, సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 66 సచివాలయాల్లో పూర్తిగా 100% పారిశుధ్య నిర్వహణ జరిగిందని, పురపాలక మరియు పట్నాభివృద్ధి శాఖ నుండి 32 ఐఏఎస్ ఆఫీసర్లు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లుగా 149 ఆఫీసర్లు వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లుగా, 62 పారిశుద్ధ్య నోడల్ ఆఫీసర్లు, …

Read More »

బుడమేరు ప్రవాహిక ప్రాంతాలలో రెడ్ అలెర్ట్

-లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా ఆకస్మిక వరదలు …

Read More »

వైద్య సిబ్బంది సైనికుల్లా ప‌నిచేయాలి

-వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద య‌జ్ఙాన్నే చేప‌ట్టింది -190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాం -వెయ్యికి పైగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తున్నారు -ల‌క్ష‌ మందికి పైగా మెడిక‌ల్ క్యాంపుల్లో వైద్య సేవ‌ల్ని పొందారు -ఇంటింటికీ అత్య‌వ‌స‌ర మెడిక‌ల్ కిట్లు అంద‌జేశాం -వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య సేవ‌లందించ‌డంలో వైద్య ఆరోగ్య శాఖ మందుంది -ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిశానిర్దేశంతోనే తాము నిరంత‌ర‌మూ ప‌నిచేస్తున్నాం -వైద్య సిబ్బంది శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -వ‌ర‌ద …

Read More »

అను హాస్పిటల్స్ లో అత్యాధునిక చికిత్స

– అరుదైన అబ్డామినల్ అయోర్ట ఎన్యురిజం సమస్యకు ఎండో వాస్క్యులర్ చికిత్స – కోతలు, గాట్లు లేకుండానే.. సమస్యకు సత్వర పరిష్కారం – రోగికి తప్పిన ప్రాణాపాయం.. నొప్పి నుంచి ఉపశమనం – రాష్ట్ర వైద్య చరిత్రలో నూతన శకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ ఎం. భవానీ శంకర్ – ⁠అత్యంత క్లిష్టమైన రక్తనాళ సంబంధిత సమస్యలకు అను హాస్పిటల్స్ ఇంటర్వెన్షల్ రేడియాలజీ విభాగం ద్వారా సులభతరమైన చికిత్సలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో కృషి …

Read More »

వరద బాధితులకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహాయం

– ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 15 లక్షల విరాళం – వరద బాధిత కుటుంబాలకు రిలీఫ్ కిట్ల పంపిణీ – సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీకి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్రమైన వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్థం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 15 లక్షల విరాళాన్ని …

Read More »

8వ రోజూ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-జక్కంపూడి కాలనీలో ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడిన సిఎం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 8వ రోజు కూడా పర్యటించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బయలు దేరిన సిఎం ముందుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. పడవలు ఢీ కొనడం వల్ల దెబ్బతిన్న బ్యారేజ్ కు జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, నిపుణులతో మాట్లాడి కౌంటర్ వెయిట్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెం జంక్షన్, సితార …

Read More »

విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో వ్యాధుల‌పై రేప‌టి నుండి ఇంటింటి స‌ర్వే

-నాలుగు రోజుల స‌ర్వే కోసం 150 వైద్య బృందాల ఏర్పాటు -స‌ర్వే సిబ్బందికి శిక్ష‌ణ అందించిన వైద్య ఆరోగ్య శాఖ‌ -వ‌ర‌ద పీడిత ప్ర‌జ‌ల‌కు మాన‌సిక స్థైర్యాన్ని కూడా క‌ల్పించాల‌న్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -మాన‌వ‌తా ధృక్ప‌ధం, ఉద్యోగ బాధ్య‌తతో స‌ర్వే నిర్వ‌హించాల‌న్న మంత్రి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌లో భారీ వ‌ర్షాల‌తో వ‌ర‌ద ముంపుకు గురైన ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం నుండి ఇంటింటి స‌ర్వే చేప‌ట్ట‌నుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ స‌ర్వేను …

Read More »

ఏలేరు వరదపై సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-ముంపు ప్రభావిత గ్రామాలను అప్రమత్తం చేయాలి -కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కి …

Read More »

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్దఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం గవర్నర్ వివరించారు. వరద …

Read More »

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదలొస్తున్న దాతలు

-ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తన విరాళాలు …

Read More »