-ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని …
Read More »Daily Archives: October 6, 2024
సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం
-యుద్ధప్రాతిపదికన అద్దంకి బ్రాంచ్ కెనాల్ కు మరమ్మతు పనులు -భవనాసీ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభిస్తాం -మంత్రి గొట్టిపాటి రవికుమార్ -అద్దంకి బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించిన మంత్రి….జంగిల్ క్లియరెన్స్ చేయాలని అధికారులకు ఆదేశాలు అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతులకు మేలు చేకూర్చుతామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని, ఫలితంగా నీళ్లు వృధా అయ్యే పరిస్థితి వచ్చిందని …
Read More »సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పిద్దాం
-సెరిబ్రల్ పాల్సీ మానసిక వ్యాధి కాదు..శారీరక రుగ్మత మాత్రమే.. -సరైన చికిత్సలతో సక్రమంగా నడవగలిగే అవకాశం -ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు -సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగులకు సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే పురస్కరించుకుని ఆదివారం …
Read More »ఈ నెల 7వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »అక్టోబర్ 7 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 7 వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 7 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో “మీ కోసం” …
Read More »కొవ్వూరు డివిజన్లో త్వరలో అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
-డివిజన్ పరిధిలో 126 ఆర్ ఎస్ కె లలో కొనుగోలు కేంద్రాలు -జెసి ఎస్.చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంలో భాగంగా రైతులతో, రైస్ మిల్లర్స్ తో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ వారి కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై సమన్వయ సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి గణనీయంగా వస్తుందని అంచనాకు రావడం జరిగిందన్నారు. అందుకు అనుబంధంగా జిల్లాల్లోని …
Read More »మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.345 త్రవ్వకం, పరిపాలన చార్జీల నిమిత్తం
-ఇసుక సరఫరా వలన ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాదు -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికి అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ అక్టోబర్ 16 నుంచి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగు తుందన్నారు. …
Read More »ప్రశాంతంగా ముగిసిన నాలుగవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా నాలుగవ రోజు అనగా ఆదివారం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 38544 మందికి గాను 32533 మంది అభ్యర్థులు అనగా 84.40 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 92 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు సెకండరీ గ్రేడ్ ప్రత్యేక ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 22492 మందికి గాను 18955 మంది అనగా …
Read More »విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల దశ నుంచే క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా విద్యార్థులను తయారు చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో జరుగుతున్న అండర్ – 19 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకలకు ఆత్మీయ అతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »ఎమ్.ఎస్.ఎమ్.ఈ లను ప్రొత్సహించటమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం : ఎంపి కేశినేని శివనాథ్
-మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో-2024 సందర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో మరిన్నీ ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో లు నిర్వహించాలి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, ఎమ్.ఎస్.ఎమ్.ఈ లను ప్రొత్సాహించటమే ముఖ్యఉద్దేశ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో-2024 సందర్శించారు. ఎంపి కేశినేని శివనాథ్ కి ఎక్స్ పో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం …
Read More »
Prajavartha Online Telugu News