Breaking News

Monthly Archives: December 2024

కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం

-శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ -ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 57 బెంచ్ లు నిర్వహణ -ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసులలో రూ.100 కోట్ల 7 లక్షల మేర అవార్డ్ ల జారీ -జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల …

Read More »

లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్, శాప్ అధ్య‌క్షుడు రవి నాయుడు

-స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవ‌ల‌ప్మెంట్ కోసం నిపుణుల‌తో చ‌ర్చ‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌కు అనుగుణంగా విజ‌య‌వాడ‌లో క్రీడాభివృద్ధి చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ న‌డుంబిగించారు. ఈ మేర‌కు శ‌నివారం శాప్ అధ్య‌క్షుడు రవినాయుడు, శాప్ ఎమ్.డి గిరీషా ఐ.ఎ.ఎస్., పాపుల్య‌స్ (Populous) గ్లోబ‌ల్ ఆర్కిటెక్స్ ప్ర‌తినిధి సిద్ధార్థ్, ఎన్.వి.ఆర్కిటెక్స్ ప్ర‌తినిధి వెంక‌ట్ ల‌తో క‌లిసి ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గం విద్యాధ‌ర‌పురంలోని లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ ప‌రిశీలించారు. ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ది …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన కార్పెంట‌ర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 34వ డివిజన్ లోని కేదారేశ్వ‌రిపేట కాల‌వ‌గ‌ట్టు ద‌గ్గ‌ర ఎంతో కాలంగా ప‌ని చేసుకుంటున్న కార్పెంటర్స్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాము కార్పెంట‌ర్ ప‌నిచేసుకునే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించుకుండా అధికారుల‌తో మాట్లాడి అడ్డుకున్నందుకు కార్పెంట‌ర్స్ తో పాటు చిరు వ్యాపారం చేసుకునే మ‌హిళ‌లు కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ధ‌న్య‌వాదాలు చెబుతూ పుష్పగ‌చ్చం అందించి శాలువాతో …

Read More »

ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం డిసెంబర్ 15, 2024న తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాట్ల లో ఎటువంటి లోపం ఉండకూడదని, విజయవాడ నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేయాల్సిన వసతుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి త్రాగునీటి సరఫరా లో …

Read More »

నోడల్ ఆఫీసర్లు నిత్యం అన్నా క్యాంటీన్ల నిర్వహణ చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్లలో, త్రాగునీటి సరఫరా వాడుక నీరు, కిచెన్ లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనంలో నాణ్యత, ప్రతిరోజు ఇస్తున్న టోకెన్ల వివరాలు నోడల్ …

Read More »

వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు..రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెల్లె ప్రయత్నం చేశామని, దీనిని అడ్డుకుంటూ కూటమీ ప్రభుత్వం అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడతామని …

Read More »

అన్నదానాలు మంచి సంప్రదాయాలకు ప్రతీక

-జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకొని అయ్యప్ప, భవాని, శివమాలాదారులకు అన్నదానం చేయటం మంచి సాంప్రదాయమని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. గత 45 రోజుల నుంచి అయ్యప్ప నగర్ లో శ్రీ అయ్యప్ప భక్త బృందం వారి నేతృత్వంలో అయ్యప్పలకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. …

Read More »

పేదలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన MLA బొండా ఉమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 60వ డివిజన్ వాంబే కాలాని కు చెందిన జంపన ప్రకాష్ కు ₹1,43143  చెక్కును, అలాగే 31వడివిజన్ కు చెందినమేడసాని చంద్రశేఖర్ కు ₹1,62000 లక్ష అరవై రెండు వేల చెక్కును 30వ డివిజన్ దేవినగర్ కు చెందిన కరకదివ్య నందిని లకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు …

Read More »

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని  59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్ నందు శుక్రవారం 3వ వార్షిక సెమీ క్రిస్మస్ వేడుకలు డివిజన్ సెక్రటరీ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా :-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు విచ్చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, క్రిస్మస్ భాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవ …

Read More »

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రువారం కమిషనర్ గారు నల్లపాడు, విద్యా నగర్, రెడ్డి పాలెం, ఎల్ ఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం …

Read More »