Breaking News

ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఉర్దూ స్కూల్ లోని 124, 125, 126, 132 నుండి 136 వరకు, 139 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పిఎస్ నెంబర్ మరియు బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో అందిన ఫారాలు పక్కాగా ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. క్యాంప్ ల్లో ప్రజల నుండి నూతన ఓటు కై దరఖాస్తు అర్జీలు తీసుకోవడం జరిగిందన్నారు. ఓటర్ కార్డ్ లో చిరునామా, పేరు, పుట్టిన తేది తదితర మార్పుల కై అర్జీలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ డి.శ్రీనివాసరావు, సూపర్వైజరి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *