Breaking News

డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారము తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసులను సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. క్రిమినల్ కేసులు కి సంబంధించి బెయిల్ కోసం వేసిన అర్జీల వివరాలు తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *