
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా, బొబ్బిలి లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 09 గంటల వరకు ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు, వై రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్వతిపురం మన్యం జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్రావు, సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ శంకర్రావు, ముఖ్య సలహాదారు కైలాసరావు, అప్పారావు, బి వి రమణ, రాంబాబు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News