Breaking News

నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల పై శిక్షణా కార్యక్రమం

-డిఆర్వో సీతారామమూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమర్థవంతమైన మరియు సమానమైన నీటి సరఫరా మరియు పంపిణీ వ్యవసాయ ఉత్పత్తి యొక్క వాంఛనీయ వినియోగ మెరుగుదలకు నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు కీలక పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా రెవెన్యు అధికారి టి సీతా రామమూర్తి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, మూడు విభాగాల్లో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నీటి వినియోగదారుల, పంపిణి, రెవెన్యు కేటగిరిలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యు, ఇరిగేషన్ శాఖలు కీలక పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. నీటిపారుదల మౌలిక సదుపాయాల శాస్త్రీయ మరియు క్రమబద్ధమైన అభివృద్ధి మరియు నిర్వహణ విషయంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందనీ స్పష్ట చేశారు. నీటి ప్రభావవంతమైన మరియు విశ్వసనీయ సరఫరా మరియు పంపిణీ కోసం నీటిపారుదల వ్యవస్థ నిర్వహణ మరియు నిర్వహణ కొనసాగింపు, లబ్దిదారు రైతుల నుండి నీటిపారుదల నీటి రేట్లు రికవరీ చేయడంలో సమన్వయ పాత్ర పోషించడంతో పాటుగా పర్యావరణం మరియు పర్యావరణ సమతుల్యత యొక్క రక్షణ బాధ్యతలు చేపట్టడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పరిథిలో నీటి వినియోగదారుల అసోసియేషన్ ఎన్నికలు నిర్వహణా చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల పరిపాలన నిర్వహణ కోసం కాడా కమీషనర్ ఎన్నికల అథారిటీ వ్యవహరిస్తారని రాణి సుస్మిత పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అథారిటీ – జిల్లా కలెక్టర్ , అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ – జాయింట్ కలెక్టర్ ,  డిప్యూటీ జిల్లా ఎన్నికల అథారిటీ – సంబంధిత రెవెన్యు డివిజన్ కు చెందిన సబ్ కలెక్టర్ లేదా రెవిన్యూ డివిజన్ అధికారి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి – రైతు ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడిన అధికారి నీ , ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం పోలింగ్ అధికారినీ  జిల్లా ఎన్నికల అథారిటీ నియమిస్తారని తెలియ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత శిక్షణ కార్యక్రమం లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు గుర్తింపు తదితర అంశాలపై శిక్షణా ఇవ్వడం జరిగింది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది భూ యజమానుల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణ, ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో  “ఫారం ఈ”  తీసుకుని ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన చోట ఓటు హక్కు కల్పించడం, ఎన్నికల నిర్వహణ, ప్రాదేశిక నియోజకవర్గం వారీగా ఓటర్ల గుర్తింపు, ఓటు హక్కు కల్పించడం, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఓటర్ స్లీప్ జారీ, ఓటు తిరస్కరణ,  ఓట్ల లెక్కింపు , ఒక ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో ఒక నీటి సంఘంలో పదవిని కలిగి ఉండడం పరిమితిగా నిర్ణయించా లన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టరు ఆర్. రమణ నాయక్, ఎస్. సరళ వందనం, కె.ఎల్. శివ జ్యోతి, ఎమ్ మాధురి, పౌర సరఫరాల డి ఎమ్ టి.రాధిక తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, ఇరిగేషన్ అధికారులు, పంచాయతి రాజ్ అధికారులు, రెవిన్యూ, ఉపాధ్యాయులు తదితర శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *