అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వాన లేఖను పంపారు. యూపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే సాంస్కృతిక బృందాలతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులకు యూపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గంగాజలం ఇచ్చారు. సిఎం వారిని సత్కరించారు.
Tags amaravathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News