Breaking News

నూతన సంవత్సరం డైరీ ను విడుదల చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి సీనియర్ నాయకులు రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ని శుక్రవారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నేతలు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని సుజనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీయే కూటమి నేతలు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, పోతిన భేసు కంటేశ్వరుడు, దాడి అప్పారావు, దుర్భేసుల హుస్సేన్, బోగవల్లి శ్రీధర్, పైలా సురేష్, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *