Breaking News

6-7న విజయవాడలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్రస్థాయి శిక్షణ సమావేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన అమలు సాధించే దిశగా బీసీలను సమాయుత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ నెల ౬,౭ తేదీల్లో విజయవాడలోని పున్నమిఘాట్ నందు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్ర జిల్లా చైర్మన్లు, కన్వీనర్లు, మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొననున్నారు అని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు తెలిపారు. రానున్ నరోజుల్లో ప్రజాపోరాటాలు మరింత తీవ్రతరంచేసే దిశగా, కులగణనపై చేయబోయే పోరాటాలపై కార్యాచరణ తీర్మానాలు, బీసీల సమస్యలపై శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని డా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా పూర్ణచంద్ర రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీ పరంజ్యోతి, కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్ర రావు, కన్వీనర్ బీసీ రమణ, తదితరులు పాల్గొంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *