Breaking News

23 లక్షల నిధులతో పిఎసిఎస్ నూతన కార్యాలయ భవనం

-అనంతరం లక్ష్మీపురం పిఎసిఎస్ నూతన చైర్ పర్సన్ నెక్కలపు ప్రమీల మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యక్రమాన్ని ఉద్దేశించి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో అమిత్ షా గారు సహకార సంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని దానిలో భాగంగానే దేశంలోని అన్ని సొసైటీను కంప్యూటర్జేషన్ చేయటానికి అమిత్ షా గారు పూనుకున్నారని కృష్ణా సహకార సంఘంలో అన్ని సొసైటీలు కంప్యూటరైజేషన్ పూర్తి అయ్యి గ్రామీణ రైతులకు సేవ చేయటానికి మా సిబ్బంది సిద్దంగా ఉన్నారని గ్రామీణ ఆర్థిక బలాన్ని తగ్గించటానికి సొసైటీలు ఎంతో దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 80 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన సంఘం కావడం సంతోషం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. లక్ష్మీపురం సహకార సంఘం లో 1033 మంది సభ్యులు ఉన్న సొసైటీ లో రాబోయే సంవత్సరానికి 80 ఏళ్ళు పూర్తి చేసుకొని సంబరాలకు సంసిద్ధం అవ్వాలని ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *