-అనంతరం లక్ష్మీపురం పిఎసిఎస్ నూతన చైర్ పర్సన్ నెక్కలపు ప్రమీల మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యక్రమాన్ని ఉద్దేశించి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో అమిత్ షా గారు సహకార సంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని దానిలో భాగంగానే దేశంలోని అన్ని సొసైటీను కంప్యూటర్జేషన్ చేయటానికి అమిత్ షా గారు పూనుకున్నారని కృష్ణా సహకార సంఘంలో అన్ని సొసైటీలు కంప్యూటరైజేషన్ పూర్తి అయ్యి గ్రామీణ రైతులకు సేవ చేయటానికి మా సిబ్బంది సిద్దంగా ఉన్నారని గ్రామీణ ఆర్థిక బలాన్ని తగ్గించటానికి సొసైటీలు ఎంతో దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు
ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 80 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన సంఘం కావడం సంతోషం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. లక్ష్మీపురం సహకార సంఘం లో 1033 మంది సభ్యులు ఉన్న సొసైటీ లో రాబోయే సంవత్సరానికి 80 ఏళ్ళు పూర్తి చేసుకొని సంబరాలకు సంసిద్ధం అవ్వాలని ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు.
Prajavartha Online Telugu News