రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం అక్టోబర్ 1, 2025 ఉదయం 9 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కొత్త సర్వీసుతో ప్రజలు సులభంగా, త్వరగా రాజమండ్రి – తిరుపతి మధ్య ప్రయాణించ గలుగుతారు.
Prajavartha Online Telugu News