Breaking News

ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి. పద్మావతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన దరఖాస్తులు ప్రజలనుండి స్వీకరించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడు తూ మొత్తం 15 స్పందన దరఖాస్తు లు వచ్చాయని అన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం దరఖాస్తు లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు నిర్మాణం బిల్లు లు, ఎన్ ఆర్ ఈ జి ఎస్ చెల్లింపు లు, తదితర అంశాలపై ఫిర్యాదులు సమర్పించి త్వరితగతిన పరిష్కరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *