-జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం పట్ల హర్షం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను గన్నవరం ఎమ్మెల్యే మరియు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లిన ఆయన, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత శక్తివంతమైన రాజకీయ పక్షంగా తీర్చిదిద్దడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు టీడీపీ ద్వారా 1289 మంది ఎమ్మెల్యేలు, 149 మంది లోక్సభ సభ్యులు దేశానికి ప్రాతినిధ్యం వహించారని, 9 మంది కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ మరియు శాసనమండలి సభ్యులను అలానే అనేక మంది ప్రజా నాయకులను దేశానికి అందించిన విశిష్ట గౌరవం తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. దేశ ప్రధానుల, రాష్ట్రపతి ఎంపికలోనూ, అలాగే లోక్సభ స్పీకర్, గవర్నర్ పదవుల భర్తీలోనూ టిడిపి కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారి మహత్తర దూరదృష్టితో 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన క్రమశిక్షణ, విజన్తో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని యార్లగడ్డ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ను 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదేనని ఆయన గుర్తు చేశారు. అంకితభావంతో శ్రమించే కార్యకర్తలే టిడిపికి అసలైన బలమని, అలాంటి గొప్ప వారసత్వం మరియు విలువలున్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ఒక గౌరవప్రదమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహించాలని యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News