Breaking News

ఘనంగా “ప్రపంచ మలేరియా దినోత్సవం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఈరోజు “ప్రపంచ మలేరియా దినోత్సవం” ఘనంగా నిర్వహించడం జరిగింది. 25/4/26 తేదీ వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ M. సుహాసిని మరియు జిల్లా మలేరియా ఆఫీసర్ D. రాజు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ, మన జిల్లాలో మలేరియా మీద నిరంతరం పోరాటం చేస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ, ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, వారందరూ పాటించే విధంగా చేస్తే ఈ మలేరియా ని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చినని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి పూర్తి అవగాహనతో ముందుకు నడవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డి యం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఇందుమతి దేవి, ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి నాయుడు, డిపిఎమ్ఓ డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విద్యాసాగర్, మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *