ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అందచేయ్యడం లో వ్యవసాయ అధికారులు నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో వ్యవసాయ శాఖ కి చెందిన 2022 డైరీని, క్యాలెండర్ ను జేసి డా.బి ఆర్ అంబేద్కర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.బీఆర్ అంబేద్కర్, వ్యవసాయ శాఖ జెడి జగ్గారావు, వ్యవసాయ శాఖ జిల్లా సంఘ అధ్యక్షుడు కేజేడీ రాజన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News