-సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని మైలవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్. ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఈనెల 2వ తేదీ సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉదయం 10.00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించవచ్చునని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రతీ వారం స్పందన కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రతీ మండలంలోని ప్రధాన గ్రామంలో ఒక్కొక్క సోమవారం నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ జిఎస్ఎల్ ప్రవీణ్ చంద్ అన్నారు.
Prajavartha Online Telugu News