విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం దత్త క్రియా యోగ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరంలో ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలు నుండి 6గంటలు వరకు ఉచిత దత్త క్రియా యోగ తరగతులు జరుగుతాయన్నారు. ఆరోగ్య పరిరక్షణకు యోగ తరగతులు దోహదపడతాయన్నారు. కావున ఆసక్తి కలిగిన వారు మందిరంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News