Breaking News

ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో యోగ తరగతులు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం దత్త క్రియా యోగ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరంలో ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలు నుండి 6గంటలు వరకు ఉచిత దత్త క్రియా యోగ తరగతులు జరుగుతాయన్నారు. ఆరోగ్య పరిరక్షణకు యోగ తరగతులు దోహదపడతాయన్నారు. కావున ఆసక్తి కలిగిన వారు మందిరంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *