విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రాష్ట్ర నాయకుడు డాక్టర్ తరుణ్ కాకాని మంగళవారం పార్టీ కార్యాలయానికి ఎయిర్ కండీషనర్ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, డాక్టర్ తరుణ్ పార్టీకి చురుగ్గా సేవలందిస్తున్నారని, ప్రజాసేవలో ఎంతో మక్కువతో నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యాలయానికి విరాళం అందించినందుకు డాక్టర్ తరుణ్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ డీటీ కోశాధికారి అవ్వారు శ్రీనివాసరావు, బీసీ మోర్చా అధ్యక్షుడు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …