Breaking News

గురునానక్ కాలనీ, పటమట పర్యటించి పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలో ఉన్న గురునానక్ కాలనీ లోని ఫన్ టైమ్స్ క్లబ్, పటమట లోని ఖన్నా నగర్, ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫన్ టైంస్ క్లబ్ పర్యటించి, ఎక్కడన్నా చిన్నారులతో సంభాషించారు, వారు ఆడుతున్న ఆటల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. అక్కడున్న వారితో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పటమట లోని ఖన్నా నగర్ ప్రాంతం పర్యటించారు, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని అన్నారు. ఖాళీ ప్రదేశాల యజమానులు తమ తమ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు ఎటువంటి సౌకర్యము కలగకుండా వర్షపు నీటి నిలువల దోమలు పేర్కొన్న చూసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలు విజయవాడ దగ్గర పాలిక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు సర్కిల్ 3 జోనల్ కమిషనర్ శివరామకృష్ణ, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చీరన్ రాయ్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *