Breaking News

సైడ్ డ్రైన్ లలో డి సిల్టింగ్ చేయించండి…

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తరచుగా డి సిల్టింగ్ చేస్తూ సైడ్ కాలువల్లో మురుగు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తన పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, మదర్ తెరేసా జంక్షన్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశుద్ధ నిర్వహణ మెరుగుపరచాలని, తరచుగా సైడ్ డ్రైన్ లలో డి సిల్టింగ్ పనులు చేస్తూ మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకోవాలని, ఏదైనా ఆటంకాలు గమనిస్తే వెంటనే తగు చర్యలు తీసుకొని మురుగునీరు సక్రమంగా అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *