Breaking News

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి-కేశినేని జానకి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చుట్టుగుంట‌ ప్రాంతంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 36వ బోనాల సంబరాల్లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి బొండా సుజాత క‌లిసి పాల్గొన్నారు. అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల సంబరాలుల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో విజయవాడ ప్రాంతం దేశ స్థాయిలో అభివృధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ వల్లభనేని సతీష్,ప్రెసిడెంట్ బీసం రాములు, వైస్ ప్రెసిడెంట్ తోట పాండు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *