Breaking News

నగర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని నగర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ మధుసూదనుడు జన్మించాడని తెలిపారు. ఆ గోకుల నందనుడు జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయమని వెల్లడించారు. శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని.. సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా ఆ పరమాత్ముడు అర్జునునికి గీతను బోధించాడని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందన్నారు. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుందని.. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితం సంతోషమయం అవుతుందని తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *