Breaking News

ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపుకు నగరపాలక సంస్థ, అదనపు కమిషనర్, సిటి ప్లానర్, సూపరిండెంట్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 3 కమిటీలను ఏర్పాటు చేశామని, వీధి వ్యాపారులు కూడా ఆయా జోన్లకు వెళ్లడానికి సమాయత్తం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల ట్రాఫిక్ పెరుగుతుందని, ప్రధాన రహదారులను విస్తరించినప్పటికీ వీధి వ్యాపారుల ఆక్రమణల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్ మార్జిన్ లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలకు గురి అయి, వాహనాల రాకపోకలకు, అత్యవసర పరిస్తితులలోని వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి వస్తుందన్నారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య సిబ్బంది పలుమార్లు ఆక్రమణదార్లకు సమస్యపై తెలియచేసినప్పటికీ ఏవిధమైన సహకారం లేకుండా యధావిధిగా ఆక్రమణలు చేస్తున్నారన్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం స్ట్రీట్ వెండింగ్ పాలసీ అమలుకు నగరంలో రెడ్, అంబర్, గ్రీన్ జోన్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించడానికి నగరపాలక సంస్థ సీనియర్ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. జోన్ల ఏర్పాటుకు ముందు వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డ్ లు అందిస్తామని, ఆయా జోన్లలోనే క్రయ విక్రయాలు చేసుకునేలా వీధి వ్యాపారులు సహకరించాలని కోరారు.
నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ జోన్ల ఏర్పాటు అయ్యేవరకు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న వీధి వ్యాపారులకు ముందుగా తెలిపి, రోడ్ మార్జిన్ అతిక్రమించకుండా చూడాలని, వీధి వ్యాపారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. జిఎంసి సిబ్బంది వీధి వ్యాపారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీధి వ్యాపారులు కూడా నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించి నిబందనలు పాటిస్తూ, వారి కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్య ఉత్పన్నమైన ఎడల నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. జోన్ల ఏర్పాటు అయిన పిదప నిర్దేశిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సమయాత్తం కావాలన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *