Breaking News

పర్యావరణ హిత చవితి కావాలి మనందరి లక్ష్యం

-మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై .. పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యావరణ హిత లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని ‘పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం’పోస్టర్ ను, కరపత్రాలను ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మదన్ మోహన్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మనందరం సమిష్టిగా కృషి చేయాలని సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని చేసే కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడరాదని తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *