Breaking News

వరద బాధితుల సహాయార్థం ఎపి గెజిటెడ్ అధికారుల సంఘం జెఎసి ఒక రోజు మూలవేతనం సియం సహాయ నిధికి విరాళం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం జెఎసి ఒకరోజు మూల వేతనం సియం సహాయ నిధికి విరాళం గా అందించి.ఈమేరకు గురువారం విజయవాడ కలెక్టరేట్ లో ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇస్తూ లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం ఆసంఘం జెఎసి అధ్యక్షులు కె.వి.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అందించే తోడ్పాటుకు చేయూతగా ఒకరోజు మూల వేతనాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘం కన్వీనర్ యం.తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *