Breaking News

27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం నేడు టీడీపీ కేంద్రకార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఆయన కరచరములలో ఉండి ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. నిర్వహించిన వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా సాగిన వేలంపాటలో కేంద్రకార్యాలయంలో పనిచేస్తోన్న ప్రోగ్రాం కమిటీ రూ. 27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఏ.వీ రమణ, ధారపనేని నరేంద్ర, రాంబాబు, హర్షా, ధామోదర్, సంపత్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది కావునా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏక దంతుడి ఆశీసులు పొందాలని , నాయకులు, కార్యాలయ సిబ్బంది కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *