-జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ డా. జి. సృజన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని, దీనిలో భాగంగా కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.
Prajavartha Online Telugu News