Breaking News

ప్రశాంతం గా ముగిసిన ఆరవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 08/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 31493 మందికి గాను 27937 మంది అభ్యర్థులు అనగా 88.70 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 67 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16286 మందికి గాను 14349 మంది అనగా 88.11 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 15207మందికి గాను 13590 మంది అనగా 89.37 శాతం మంది హాజరయ్యారు. ఆరవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి అని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *