Breaking News

ప్రశాంతంగా ముగిసిన పదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదవ రోజు అనగా 14/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు అనగా 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 మంది అనగా 88.46 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 61 సెంటర్లలో పేపర్ 2 ఏ.మాథ్స్ & సైన్స్ అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 15743 మందికి గాను13107 మంది అనగా 83.29 శాతం మంది హాజరయ్యారు. పదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాధమిక కీ 15-10-2024 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి . ప్రాధమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను 18-10-2024 వరకు టెట్ వెబ్సైటు (https://aptet.apcfss.in/ ) ద్వారా మాత్రమే స్వీకరిస్తారని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *