విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బి.యన్.కె.యు. ఫౌండేషన్ వారు ఆర్గనైజర్ గా ఐకాన్ పబ్లిక్ స్కూల్ వారి సహకారంతో ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య, ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ది విజయవాడ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో 15 లక్షల నగదు బహుమతితో విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతున్న భారతీయ నవీన క్రీడ ఉత్సవ్ 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీల్లో 6 రౌండ్లు పోటీలను ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పొట్లూరి భాస్కరరావు, కువైట్ కి చెందిన బ్రిటిష్ కౌన్సిల్ ఇన్విజిలేటర్ ఫర్ ఐఈఎల్టిఎస్ దుగ్గిరాల హరిత, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వి జ్వాలాముఖి, ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర తదితరులు టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం మరియు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ వసంత్ సమక్షంలో మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు.
5/5 పాయింట్లు ఆరో రౌండ్లో ఇంటర్నేషనల్ మాస్టర్ శ్రీహరి (2372) తెల్లపావులతో మరియు ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా (2467) నల్లపావులతో పోటీపడగా దాదాపు నాలుగు గంటల పాటు ఆట కొనసాగింది. ఎట్టకేలకు ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా (2467) గెలిచారు. మొత్తం మీద ఆరు రౌండ్లు ముగిసేసరికి ఇంటర్నేషనల్ మాస్టర్ 6/6 పాయింట్లతో నీలాష్ సాహా (2467) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ వెంకటేష్ ఎం.ఆర్, ఇంటర్నేషనల్ మాస్టర్ శర్వనన్ కృష్ణన్ , పశ్చిమ బెంగాల్ చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ కౌత్సవ్ కుండు 5.5/6 పాయింట్లతో కొనసాగుతున్నారని టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం, డైరెక్టర్ విత్తనల కుమార్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
Prajavartha Online Telugu News