Breaking News

కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *