Breaking News

సోమవారం స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వారిచే స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించ బడును. కృష్ణా జిల్లా కలెక్టర్ వారి సర్కులర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున విజయవాడ డివిజన్ లోని ప్రజలందరూ తమ సాధారణ విజ్ఞప్తులను, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విజ్ఞప్తులను తగు ఆధారాలతో సోమవారం పైన తెలియజేయబడిన సమయం లో స్వయంగా సబ్ కలెక్టర్ వారికి అందచేయవచ్చునని తెలిపారు .ప్రజలు ఈ కార్యాలయానికి వచ్చేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్క్ లను విధిగా ధరించి రావాలని కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *