Breaking News

 ఈనెల 27న విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల సౌజన్యంతో ఈనెల 27వ తేదీ సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీనగర్లో విజయవాడ చాంబర్ హాలులో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్యశిబిరంలో ఎముకల పటుత్వ పరీక్ష, నాడీ పరీక్ష, శరీర పరిస్థితి, రక్తపోటు, బరువు, ఎత్తు, హృదయ స్పందన అవసరమైతే ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. చాంబర్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ వ్యాపార సంస్థల సిబ్బంది, ముఠా కార్మికులు, పేద ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రవికుమార్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *