అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆసుపత్రుల యాజమాన్యాలకు కలిపి రూ.501 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు ఇంఛార్జి సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు నేడొక ప్రకటనలో తెలిపారు. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిలు పొందేందుకు 873కుగాను 531 ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. వీటిలో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. బకాయిలపై ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత ప్వం ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరుగుతున్నాయి..
Tags amaravathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News