విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కు చెందిన బోధనపు సుజన అనారోగ్య సమస్య తో బాధ పడుతోంది. ఆమెకు సర్జరీ చేసేందుకు 1,80,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. వారికి వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దానికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను బాధితురాలి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో. బిజెపి నాయకులు -రెడ్డిపల్లి రాజు , సోమేశ్వరరావు దేవిక హరి ప్రసాద్ , రుద్రపాటి వెంకటేష్ పగడాల కృష్ణ – టిడిపి 54వ డివిజన్ అధ్యక్షులు అజీజ్, 43వ డివిజన్ జనసేన అధ్యక్షులు కోటేశ్వరరావు, దేవర జోగేశ్వరరావు శామీల కాతూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైనారిటీ మోర్చా, జ్యోతిర్మయి రెడ్డి, బీజేవైఎం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, పగిడిపల్లి రాజేశ్వరి, మహంతిపురం మండల అధ్యక్షరాలు , పత్తిపాటి శ్రీధర్ , సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News