Breaking News

డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

-ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్
-ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజా సమస్యలు
-55వ డివిజన్ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న నాగుల్ మీరా ఎంఎస్ బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా, గ్రంథాలయ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు

ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గర నుండి లేరుగా సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమాలను విజయవాడ పార్లమెంట్లో అమలు చేస్తున్న ఎంపీ కేశినేని చిన్నికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అధికారులు చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమం ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు నాయకులు స్థానిక అధికారులు ఒకే చోట ఉండడంతో ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వడానికి దోహదపడతాయని అన్నారు

స్థానికంగా ఉన్న ప్రజలు పెన్షన్లు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు రేషన్ కార్డులు ఇలా అనేక సమస్యలతో రావడం జరిగిందని త్వరలోనే ప్రభుత్వం పెన్షన్ల పైన తీసుకొచ్చే కొత్త పాలసీ పైన వారికి సమాచారం ఇచ్చి అన్ని విధాల వారికి భరోసా ఇచ్చి ఈ వివరాలన్నీ కూడా కొత్త పెన్షన్స్ లో లో వచ్చే విధంగా చూస్తామని వారికి భరోసా కల్పించారు జీవో నెంబర్ 30 ద్వారా విజయవాడ ప్రజానీకానికి గొప్ప శుభవార్త ఎంపీ చిన్ని తెలిపారని వారు ఇరువురు అన్నారు

ఈ కార్యక్రమంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గ్రంథాలయా చైర్మన్ ఎంఎస్ బేగ్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు క్లస్టర్ ఇంచార్జ్ ధనేకుల సుబ్బారావు డివిజన్ అధ్యక్షుడు జహీద్ నాయకులు రేష్మ వడ్డాది రవి, మల్లీశ్వరి పార్వతి ఎర్రంశెట్టి పద్మ ఐ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాధవ్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్సర్ తెలుగు మహిళా అధ్యక్షురాలు నసీమా నాయకులు దుర్గ శాంతి బుజ్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *