Breaking News

ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరమును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరములు గుడివాడ యంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఏం.అర్. కిట్లు మొదలగు వాటికీ ఎంపిక మరియు గుర్తింపు జరుగును. కావున మండల పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు వారియొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, 4 ఫోటోలతో శిబిరమునకు హజరు అయ్యే విధంగా సచివాలయం సిబ్బందిని మరియు వాలంటీర్లు ను ఆదేశించడమైనదని తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *