Breaking News

కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందిచటమే ధ్యేయంగా విభిన్న కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బెంగుళూరులోని కర్ణాటక మీడియా అకాడమీని ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ మరియు కర్ణాటక మీడియా అకాడమీ పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న వెబ్ సైట్, సోషల్ మీడియా, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులతో పాటు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న పలు అవగాహాన కార్యక్రమాలను ఏపీ ప్రెస్ అకాడమీ టెక్నికల్ కన్సల్టెంట్ పిఎన్ ప్రసన్న కుమార్ వివరించారు. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించారని కర్ణాటక మీడియా అకాడమీ ఛైర్మన్ కె.సదాశివ్ షెనాయ్ సంతోషం వ్యక్తం చేసారు. జర్నలిస్టులకు ఉపయోగపడేలా ఏపీ ప్రెస్ అకాడమీ చేస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో కర్ణాటక మీడియా అకాడమీ సెక్రటరీ సి.రూప, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *