విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం క్రీస్తురాజపురం కి చెందిన కందుల ఫాతిమా గారి పిల్లల చదువు కొరకు, మరియు అనారోగ్యంతో బాధపడుతున్న సిద్దిల కిరణ్ , మట్టా కిరణ్ ల వైద్య ఖర్చుల నిమిత్తం మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్, డివిజన్ అధ్యక్షులు మట్టా ప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు సొంగా రాజ్ కమల్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News