Breaking News

కులాల సర్వే-2023 కి సంబంధించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులాల సర్వే-2023 కి సంబంధించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కులాల సర్వే-2023 పై జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర స్థాయి అధికారులు దిశా నిర్దేశనం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర సమన్వయ శాఖల అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, వాలంటీర్లు మరియు సెక్రటేరియట్ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. ప్రతి సభ్యుడు మరియు గృహ సర్వే ముగింపులో వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగి యొక్క ఈ కేవైసి తప్పనిసరి పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా కుటుంబ సభ్యుల యొక్క ఈ కేవైసి సర్వే పూర్తి చేయడానికి తప్పనిసరి పేర్కొన్నారు.  వాలంటీర్ పూర్తి సర్వే ప్రారంభం నుండి చివరి వరకు ఒకే మొబైల్ పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని, ఆమేరకు అధికారులు క్షేత్ర సర్వే సిబ్బందికి స్పష్టం చేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక వాస్తవిక సమస్యల కోసం, జిల్లా స్థాయిలో నోడల్ వ్యక్తులుగా జీ ఎస్ డబ్ల్యూ ఎస్ జిల్లా కోఆర్డినేటర్ మరియు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మండల, డివిజనల్ మరియు జిల్లా స్థాయి అధికారులు సర్వే ప్రక్రియ ధృవీకరణ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *