అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు జరుగుతున్నటువంటి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి 67వ తిరు నక్షత్ర వేడుకలలో భాగంగా మూడవ రోజు ఉదయం చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి, విద్యార్థులకు శ్రీ చిన్న జీయర్ స్వామి వారు శ్రీ రామ పాదుకులను అందించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల చేత శ్రీరామ పాదుకా పూజ ను శ్రీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిపించారు.
Prajavartha Online Telugu News