విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ లో జరగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ తీరు, హాజరు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు వెంట ఎన్టీఆర్ జిల్లా డీఈవో యు.వి.సుబ్బారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News