Breaking News

స్వచ్ఛత హి సేవలో అందరూ పాల్గొనండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత హి సేవలో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర పౌరులందరికీ పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో, సెప్టెంబర్ 17, 2024 మంగళవారం నాడు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గాంధీ గారి ఆశయంగా స్వచ్ఛ భారత్ మిషన్ గా 2014 లో మొదలైన స్వచ్ఛభారత్ 2024 కి పది సంవత్సరాల పూర్తయ్య శుభ సందర్భంగా, ఈ సంవత్సరం జరిగే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలోని నగర పౌరులు, విద్యార్థులు, అందరూ పాల్గొనాలని స్వచ్ఛ విజయవాడలో భాగస్వాములు కావాలని అన్నారు. మంగళవారం ఉదయం స్వచ్ఛత హి సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం మాకు నేని బసవపూర్ణయ్య స్టేడియంలో ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మొదలవుతుందని ప్రజలందరూ వచ్చి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే.వి. సత్యవతి, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *