విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 08/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 31493 మందికి గాను 27937 మంది అభ్యర్థులు అనగా 88.70 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 67 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16286 మందికి గాను 14349 మంది అనగా 88.11 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 15207మందికి గాను 13590 మంది అనగా 89.37 శాతం మంది హాజరయ్యారు. ఆరవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి అని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …
Prajavartha Online Telugu News